ఎమ్మార్వో ముందు బైండోవర్

Published: Friday July 30, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 29 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని ఎర్ధండి గ్రామానికి చెందిన గ్రామ పెద్ద మనుషులు మరియు కుల సంఘాల పెద్దమనుషులను ఎమ్మార్వో గారి ముందు బైండోవర్ చేయడం జరిగినది. గ్రామాలలో ఎవరైనా పెద్ద మనుషులు ఎలాంటి వేలంపాటలు నిర్వహించరాదని ఎవరైనా గ్రామ పెద్ద మనుషులు ఇసుక కు గాని బెల్టుషాపుల గాని మరే ఇతర చట్టవ్యతిరేక పనులకు వేలంపాటలు నిర్వహించినట్లు అయితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని  ఎస్సై డి. నీనిషా రెడ్డి తెలిపారు.