నిందితుడిని వెంటనే ఉరి తీయాలి : వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపు రామ్ ప్రకాష్
Published: Wednesday September 15, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్14, ప్రజాపాలన : ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారం జరిపి, దారుణ హత్యకు కారణమైన వ్యక్తి ని వెంటనే ఉరి తీయాలని వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపు రామ్ ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాచారం జరిగిన సంఘటన తమని కలసివేసిందని హైదరాబాద్ నగరానికి వెళ్ళి చిన్నారి చైత్ర తల్లిదండ్రులను కలిసి పరామర్శించడం జరిగిందిని అన్నారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచారంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోందని తెలిపారు. నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలని, బహిరంగంగ ఉరితీయాలన్న డిమాండ్లతో ప్రజలు ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లోనూ చిన్నారికి నివాళులు అర్పిస్తున్నారని గుర్తు చేశారు. మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్పందించాలని, ఈ లాంటి ఘటన లు పునరావృతం కాకుండా చర్యలు తీకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Share this on your social network: