సీతారామాంజనేయ ఆలయానికి లక్ష విరాళం ప్రకటించిన ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Published: Monday January 31, 2022
మేడిపల్లి, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : వెంకేపల్లి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ1,01,116/ విరాళంగా అందజేశారు. గ్రామస్థుల అభ్యర్ధన మేరకు ఈ విరాళాన్ని ప్రకటించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. గ్రామ అభివద్ది కొరకు 10లక్షల రూపాయల నిధుల మంజూరికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారంగా కుడుముల వెంకట్ రెడ్డి (సునీల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి) 101116/ ప్రకటించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 3 తేదీన ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని గ్రామస్థులు వీరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుంట చంద్రా రెడ్డి, తోనుకునూరీ సైదులు, తీగల జగదీష్ రెడ్డి,ఇమ్మడి జయకుమార్, పాల్వాయి జగదీష్, నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.