ప్రవేటు ఉపాధ్యాయులకు ఉచితంగా 25 కిలోల బియ్యం పంపిణీ

Published: Friday April 23, 2021
మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ పరిగి, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో 6 వ వార్డు సుల్తాన్ నగర్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచితం బియ్యం పంపిణీ  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 25 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం, జరిగిదన్నారు. కరోనా దుష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మన తెరాస ప్రభుత్వం పని చేస్తుందని కొనియాడారు. అనంతరం కౌన్సిలర్ నాగేశ్వర్ తో కలిసి అండర్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత మట్టిని వేయించి, డోజర్ ద్వారా సరి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.