సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి కూసుమంచి ప్రథమ స్థానంలో ఉండాలి

Published: Friday January 28, 2022
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ  ఇంచార్జి దొబ్బల సౌజన్య
పాలేరు జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మహిళా  అధ్యక్షురాలు, నేలకొండపల్లి, కూసుమంచి సభ్యత్వ నమోదు ఇంచార్జి దొబ్బల సౌజన్య ముఖ్య నాయకులతో సమావేశంలో మాట్లాడారు. సభ్యత్వ నమోదులో వేగం పెంచాలన్నారు. మండలంలో పార్టీని మరింత బలపరిచేందుకు కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా పనిచేయాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రెండు లక్షల ప్రమాద బీమా ఇస్తామని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ తన ఇంట్లో నే పదవులు కట్టబెడుతున్నారని సౌజన్య ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు, జిల్లా కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నాయకులు మామిడి వెంకన్న, ఖాజా, కుక్కల హనుమంతరావు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, రామక్రిష్ణ, సుబాన్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు