టీఆర్ఎస్ నాయకుడు జగదీష్ కుమార్ పార్ధివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్

Published: Wednesday October 19, 2022
మేడిపల్లి, అక్టోబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన రామంతాపూర్ ఆర్టీసీ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నాయకుడు జగదీష్ కుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.           మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలో జగదీష్ కుమార్ పార్ధివదేహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, కాలనీవాసులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారు జగదీష్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేరు సతీష్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, రేపాక కుమారస్వామి, సూరం శంకర్, మోహన్ బాబు బంధుమిత్రులు, ఆర్టీసీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.