రాజీవ్ యూత్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Monday January 17, 2022
మధిర జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాజీవ్ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను శనివారం నాడు మధ్యాహ్నం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు దంపతులు ప్రారంభించారుఅనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్న అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ రోజున ముగ్గుల పోటీలు రూపంలో అందరూ ఒక్కచోట కలుసుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు.. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు పల్లపోతు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు మొండితోక జయకర్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కొఠారి రాఘవరావు, కంభంపాటి కిరణ్, దేవినేని శ్రీనివాసరావు, లంకెమళ్ల నాగేశ్వరరావు, దోర్నాల సువర్ణక్రిష్ణ, కొత్తపల్లి ఉదయ్ కిరణ్, రాజీవ్ యూత్ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Share this on your social network: