వికలాంగ యువకుడు నీటి సంపులో పడి మృతి

Published: Saturday April 01, 2023

శంకరపట్నం మార్చి 31 ప్రజాపాలన రిపోర్టర్:




కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామంలో ఇజ్జిగిరి సతీష్ అనే వికలాంగ యువకుడు అతని ఇంటి వద్దనే ఉన్న నీటి సంపులో బోర్లా పడి మృతి చెందాడు. అతని తల్లిదండ్రులు  ఇజ్జిగిరి ఐలయ్య, లక్ష్మి లు ఉదయమే పొలం పనులకు వెళ్లగా, పని ముగించుకొని అతని తండ్రి ఇంటికి వచ్చేసరికి కొడుకు కనిపించక పోవడంతో చుట్టు పక్కల వెతకగా నీటి సంపులో బోర్లా పడి ఉండడం చూసి చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. తండ్రి ఐలయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.