చికిత్స పొందుతూ హోంగార్డ్ మృతి శంకరపట్నం ఫిబ్రవరి 09 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Friday February 10, 2023
శంకరపట్నం మండల పరిధిలోని ముత్తారం గ్రామానికి చెందిన బొంగొని తిరుపతి 53 హోంగార్డుగా కరీంనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఆదివారం తన సొంత వ్యవసాయ బావి వద్ద పనులు చూసుకుంటుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి స్వల్ప అస్వస్థకు గురైనాడు. మరుసటి రోజు కరీంనగర్ లోని పోలీస్ టూ టౌన్ నందు విధులు నిర్వహించుకుని తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా తీవ్రమైన ఇంటికి తలనొప్పితో చేరుకున్నాక,  కాళ్లు చేతులకు పక్షవాతం రావడం గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెదడుకి శస్త్ర చికిత్స జరిపారు. శస్త్ర చికిత్స అనంతరం హోంగార్డ్ తిరుపతి కోమాలోకి వెళ్లి గురువారం మధ్యాహ్నం మరణించాడు. గత కొన్ని సంవత్సరాల పాటు స్థానిక శంకరపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేసిన హోంగార్డ్ తిరుపతి మరణం పట్ల స్థానిక ఎస్సై డి. చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.