లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ

Published: Wednesday November 16, 2022
మధిర రూరల్ నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు ఆర్కే ఫౌండేషన్ లో పలువురికి 25 కేజీల బియ్యం వితరణమన్నెపల్లి శరత్ కుమార్, హరిణి  కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నాయనమ్మ తాతయ్య రత్నకుమారి వరప్రసాద్ ఆర్థిక సహాయంతో ఆర్కే ఫౌండేషన్ మధిర అనాధ ఆశ్రమానికి 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది.*
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ తమ మనుమరాలు కీర్తన చిన్న వయసులో పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించినందుకు రత్నకుమారి, వరప్రసాద్  ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కీర్తన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో పదిమందికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ చారుగుండ్ల వెంకటలక్ష్మి నరసింహారావు, కార్యదర్శి లయన్ కుంచం కృష్ణారావు, లయన్ వనమా కిరణ్ కుమార్, లయన్ మహంకాళి వెంకట శ్రీనివాసరావు, వనమా వేణుగోపాలరావు (సూరి) ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, దోర్నాల రామకృష్ణ, దోర్నాల జ్యోతి పాల్గొనడం జరిగింది.*