విద్యుత్ ట్రాన్స్పార్మర్ అమర్చినా న్యూటల్ వైర్ తగిలి రెండు బర్రెలు మృతి

Published: Wednesday May 11, 2022
జన్నారం రూరల్, మే 10, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తన రెండు గేదెలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయని నల్లతీగల విష్ణు అన్నారు, ఈ సందర్భంగా అయన మంగళవారం మాట్లాడుతూ తన గేదెలు మేతకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ కు అమర్చిన న్యూటల్ వైర్ కు విద్యుత్ సరఫరా అయి షాక్ తో మృతి చెందాయని తెలిపారు, విష్ణు గెదేలు చనిపోయినందున ప్రభుత్వం ద్వారా నషపరిహరం చెల్లించాలని అయన కోరారు, స్థానిక పశువైద్యాధికారి శ్రీకాంత్ పోస్టుమార్టం చేశారని అన్నారు, ఈ కార్యాక్రమంలో నల్లతీగల విష్ణు, పశూవైద్యాధికారి శ్రీకాంత్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.