ముస్టికుంట్లలో బట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఘనస్వాగతం పలికిన నాయకులు
Published: Monday April 04, 2022
బోనకల్, ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: ప్రజాసమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర చింతకాని మండలం నాగులవంచ గ్రామం నుంచి బోనకల్ మండలం ముస్టికుంట్ల గ్రామానికి చేరుకున్న సందర్భంగా బోనకల్ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలివచ్చి భట్టి విక్రమార్కకు బంతి పూలతో ఘన స్వాగతం పలికారు. ప్రజా నాయకుడు ని కలిసేందుకు రోడ్లపైకి వచ్చిన జనాలతో ముస్టికుంట్ల గ్రామం జన జాతరను తలపించింది. భట్టి పాదయాత్రకు సిపిఐ మండల నాయకులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. డప్పు కళాకారుల బృందం విన్యాసాలు, కోలాటం మహిళల నృత్యాలతో హోరేత్తింది. సబ్బండ వర్గాల ప్రజలు కదిలి వచ్చి భట్టి అడుగులో అడుగులు వేస్తూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
Share this on your social network: