విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday July 08, 2021
పటాన్చెరు, జులై 07, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా  పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు, ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు భక్తి భావం పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం భానురు గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, గోపాల్, లక్ష్మణ్, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.