బోనకల్ మండలంలో సీఎల్పీ నేత భట్టి పర్యటన

Published: Wednesday September 01, 2021
బోనకల్లు, ఆగస్టు 31, ప్రజా పాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క బుధవారం బోనకల్ మండల పరిధిలోని పలుగ్రామాల్లో పర్యటించున్నారని మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు ఖమ్మం క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి బోనకల్ చేరుకొని వరుసగా రావినూతల, జానకిపురం, పెద్దబీరవల్లి, బ్రాహ్మణపల్లి, రాయన్నపేట, మోటమర్రి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ నాయకులను వారి కుటుంబాలను పరామర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ నాయకులు పార్టీ వివిద అనుబంధ సంఘాల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.