గాంధీ విగ్రహామ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి : బెల్లంపల్లి పట్టణ కాం

Published: Tuesday October 12, 2021
బెల్లంపల్లి, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చేతిని, చేతిలో ఉన్న కర్రను ధ్వంసం చేశారని వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకటీ శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పేర్కొన్నారు. సోమవారం నాడు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనాగరిక చర్య అని ఎటువంటి వారైనా కూడా ఈ సంఘటనలో ఉపేక్షించకుండా వెంటనే అరెస్ట్ చేసి  చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.