వరిదాన్యం కొనుగోలు చేయాలని ధర్నా....

Published: Tuesday April 05, 2022

సారంగాపూర్, ఏప్రిల్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా యాసంగి పంట వరి ధాన్యం కొనుగోలు చేయాలని తెరాస నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ గుర్రాల రాజేందర్ రెడ్డి కొల శ్రీనివాస్ ఏలేటి నర్సింహారెడ్డి డిల్లీ రామారావు జోగినపల్లి సుధాకర్ రావు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.