ఉపాధి హామీ పనుల పరిశీలించిన ఎంపిడివో : మండల అధివృద్ది అధికారి రాజా శ్రీనివాస్

Published: Tuesday June 15, 2021
మల్లాపూర్, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండలంలోని పలుగ్రామలల్లో గ్రామాద్దివృద్ది లో భాగంగా జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను సోమవారం మండల అధివృద్ది అధికారి రాజా శ్రీనివాస్ తనిఖీ చేశారు. చిట్టాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం పనులను, కుస్థాపూర్, సిరిపూర్ గ్రామలలో రోడ్డు ప్రక్కన కందకల పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సాయికుమార్, భూక్య గోవింద నాయక్, సరికెల లక్ష్మి మహిపాల్, ఎంపిటిసిలు, ఎంపీవో సతీష్, జగదీశ్వర్, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.