కొండ వెంకట రంగారెడ్డి 132 జయంతి వేడుకలు. చేవెళ్ళ నియోజకవర్గం:(ప్రజాపాలన)

Published: Tuesday December 13, 2022
చేవెళ్ల మండల కేంద్రంలో షాబాద్ చౌరస్తాలో కొండా వెంకట రంగారెడ్డి 132వ జయంతి వేడుకలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిధి లుగా
కొండా విశ్వశ్వర్ రెడ్డి పాల్గొన్ని విగ్రహనికి పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా.... మాట్లాడుతూ...
తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని,
నిజం ప్రభుత్వంలో ఎమ్మెల్సిగా పనిచేసాడాని.ఎమ్మెల్సి గా పనిచేసేటప్పుడు మహిళాల కోసం వారస్వత్వ హక్కులు సాధించి పెట్టారన్నారు.ప్రతేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాటం పనిచేసాడని
నిజం వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు.తెలంగాణ ఆత్మ గౌరవనికి కొండా వెంకట రంగారెడ్డి నిలువెత్తు రూపం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అనంతరెడ్డి. వెంకట్ రెడ్డి.కృష్ణ గౌడ్.విజయ్ కుమార్.శ్రీనివాస్ రెడ్డి.భాస్కర్.అభిషేక్ రెడ్డి.కృష్ణా.తదితరులు పాల్గొన్నారు.