నేటి నుండి ఇంటింటి పరీక్షలు

Published: Saturday January 22, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 21) :హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో నేటి నుండి చేపట్టిన ఫీవర్ సర్వేపై సంబంధిత అధికారులు శానిటేషన్ ఎస్.ఆర్.పి మహేష్, ఎంటోమొలజీ గణేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఆయన మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్యమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని, నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్ సర్వే చేపట్టడం జరుగుతుందని, హాఫీజ్ పెట్ మాదాపూర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రోజు నుండి ఫీవర్ సర్వే చెప్పటడం జరుగుతుందని, హోమ్ ఐసోలాషన్ మరియు కారోన టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఫీవర్ సర్వేలో లక్షణాలు ఉన్న వారికి కారోన కిట్లు అందజేయడం జరుగుతుందని, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కలు ధరించాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కోరారు