వెల్గటూర్ మండల తె.రా.స సమావేశం

Published: Tuesday November 16, 2021

వెల్గటూర్, నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : వెల్గటూర్ మండల టి.ఆర్.ఎస్ పార్టీ ఆదివారం రోజు సింహాచలం జగన్  అధ్యక్షతన కిషన్ రావు పేట నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు అందరూ సమానమే అని ఆయన సూచించారు. పార్టీ ప్రతిష్ట తను పెంచుకుంటూ, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి నాయకులపై ఉందని ఆయన అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్  ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని నాయకులను ఆయన కోరారు. నాయకులు కార్యకర్తలతో కలిసి పనులు చేయాలని ఆయన కోరారు. ముందుగా తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలవేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు బీ.సీ విభాగం అధ్యక్షులు కుమ్మరి వెంకటేష్ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు కొప్పుల సురేష్, యువత అధ్యక్షులబిడారి తిరుపతి, రైతు అనుబంధ అధ్యక్షులు మారం జగన్మోహన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కోమటిరెడ్డి సింధుజ రెడ్డి, అసంఘటిత కార్మిక శాఖ అధ్యక్షులు సీగిరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, మాజీ కమిటీ అధ్యక్షులు ఏలేటి కృష్ణా రెడ్డి, మండల రైతుబంధు కో ఆర్డినేటర్ చుక్క శంకర్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు గూడ రామ్ రెడ్డి, గోలి రత్నాకర్ మండల పార్టీ నాయకులు 30 గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.