తాహసీల్దార్ కార్యాలయం ముందు వీ ఆర్ ఏ ల నిరసన

Published: Thursday December 09, 2021
మరణించిన వీఆర్ఏలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి
బోనకల్, డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సహాయకులు గత పదిహేను రోజుల క్రితం మరణించిన వీఆర్ఏలకు సంతాపం తెలియచేస్తూ, పే స్కేల్ అమలు పరచడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పేస్కేల్ మరియు పదోన్నతులు హామీ అమలు చేయాలని, పెస్కేల్ అమలు చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన నిజామాబాద్ వీఆర్ఏ లు సల్లా రమేష్, నీరడి హర్షవర్ధన్ కుటుంబాలకు 20లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని మరియు కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జిల్లా ఉపాధ్యక్షులు మరీదు వెంకట్, జిల్లా జాయింట్ కార్యదర్శి పులుసు వెంకటేశ్వర్లు మండల అధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి కిరణ్, రంజిత, నాగేంద్ర, విజయ రాణి మరియు వివిధ గ్రామాలకి సంబందించిన గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.