మదర్ తెరిసా జయంతి సందర్భంగా శాంతి నిలయంలో పండు పంపిణీ

Published: Saturday August 27, 2022
బోనకల్, ఆగస్టు 26 ప్రజా పాలన ప్రతినిధి: మాతృమూర్తి మదర్ థెరిస్సా జయంతి సందర్బంగా మండల కేంద్రంలోని గల శాంతి నిలయంలొ జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ ప్రేమ, శాంతిని ఏర్పరుస్తూ ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతో మంది అనాధలకు ప్రేమ పంచిన మథర్ థెరిస్సా జయంతి సందర్బంగా ఆ గొప్ప ప్రేమ మూర్తికి మండల జనసేన పార్టీ తరపున ఘన నివాళిలు అర్పిస్తున్నాము అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లొ విద్యార్థి విభాగం నాయకులు గంధం ఆనంద్, షేక్ జానీపాషా, సజ్జనపు భరత్, తదితరులు పాల్గొన్నారు.