గులాబీ జెండా కొండంత అండ : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మె

Published: Friday July 29, 2022
వికారాబాద్ బ్యూరో 28 జూలై ప్రజాపాలన : టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం నాడు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మండల టిఆర్ఎస్ నాయకులు బైండ్ల బిచ్చన్న ఆధ్వర్యంలో *మోమిన్ పేట్* మండల కేంద్రానికి చెందిన *కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు జహీర్, ఇమ్రాన్, సల్మాన్, నజీర్, ఎజాస్, గయాజ్, షఫీ మరియు 60 మంది కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, టిఆర్ఎస్ పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.