వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Thursday January 27, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 26, ప్రజాపాలన: భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాలలో వాసవి క్లబ్స్, పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం, వైశ్య భవనం కమిటీ, ఆ వో పా ఆధ్వర్యంలో ఘనంగా జెండా పండుగను నిర్వహించు కోవడం జరిగింది. ఇందులో భాగంగా వాసవీక్లబ్ మంచిర్యాల అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ శ్రీనివాస టాకీసు ముందు, వాసవ వనితాక్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి ఎంఎం హైపర్ మార్కెట్ ముందు, ఆవోపా కాలనీలో వాసవీ కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్య వాసవి యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్, వైశ్య భవన్ లో వైశ్య భవనం కమిటీ ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, ఆ వో పా కాలనీలో ఆ వో పా అధ్యక్షుడు తంగేడిపల్లి సత్య వర్ధన్ లు త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. ఈ గణతంత్ర వేడుకలలో వాసవక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు ముక్తా శ్రీనివాస్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు కొండా చంద్రశేఖర్, సిరిపురం శ్రీనివాస్, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు దొంతుల ముఖేష్, ఛీప్ ఫ్యాట్రన్ మాదంశెట్టి సత్యనారాయణ, క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ ఛైర్మన్లు  కాచం సతీష్, కుంకుముట్టి వెంకటేష్, జిల్లా వికెఎస్పి ఇంచార్జి అప్పాల శ్రీధర్, జిల్లా అధికారులు అక్కెనపల్లి రవీందర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కంభంపాటి కమలాకర్, జిల్లా వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, వాసవీక్లబ్ కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, కోశాధికారి మల్యాల శ్రీనివాస్, యూత్ క్లబ్ కార్యదర్శి అరుణ్, కోశాధికారి బోనగిరి సాయి, వనితాక్లబ్ కార్యదర్శి గంప వాసవి, కోశాధికారి కుటకం సునీత, కపుల్సక్లబ్ కార్యదర్శి రావికంటి సంతోషి సంతోష్, కోశాధికారి బజ్జూరి శ్రీవాణి శ్రీనివాస్, వాసవీక్లబ్ నాయకులు ముస్యాల శ్రీనివాస్, గంప చంద్రశేఖర్, చందూరి కుమారస్వామి, చిలువేరు ప్రవీణ్, ఎర్రం వెంకటేష్, కొడిపాక విఘ్నేష్, కొత్త కృష్ణతో పాటు పలువురు వాసవీక్లబ్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.