సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన జిల్లాసర్పంచ్ ల పోరం అధ్యక్షుడు బూడిద రామ్ రెడ్డి

Published: Thursday July 29, 2021
ఇబ్రహీంపట్నం, జులై 28, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  చేతుల మీదుగా మడుపోజు రమేష్ చారి కి 52 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు సర్పంచ్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టి ప్రజలకు ఆహార భద్రత కార్డులు కళ్యాణ లక్ష్మి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతూ. సంక్షేమపథకాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే రైతుబంధు కావచ్చు తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో నెంబర్ వన్ గా మరో ప్రక్క గ్రామాలను అభివృద్ధి పదంలో పల్లె ప్రకృతి వనం తో గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యం ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నరసింహారెడ్డి కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ పో రెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ తెరాస నాయకులు బోసు పల్లి చంద్రశేఖర్ జక్కుల జంగయ్య యాదవ్ బోసు పల్లి ఇంద్రసేన  బోసు పల్లి నరసింహ ఏర్పుల రవి తదితరులు పాల్గొన్నారు.