రాపల్లి గ్రామ రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు వ్యవసాయ విస్తరణ అధికారి గుగులోతు గోపి

Published: Wednesday July 27, 2022

బోనకల్, జులై 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని

రాపల్లి గ్రామంలో వరి విత్తనాలును నేరుగా దమ్ము లో వెదజల్లే పద్దతి పై చిన్నబీరవల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గుగులోత్ గోపి క్షేత్ర స్థాయి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ రైతులకు ఈ పద్ధతి యొక్క ఉపయోగాలను వివరించడం జరిగింది. వెదజల్లే పద్దతి లో సాగు చేయడం వలన కూలీ ఖర్చు, నారు ఖర్చు సమయాన్ని అధిగమించవచ్చునని ఈ పద్దతిలో కేవలం 8 నుండి 10 కేజీల విత్తనం సరిపోతుంది.ఈ విధానంలో విత్తన ఖర్చు తగ్గించవచ్చు. ఈ విధానంలో సాగు చేయడం ద్వారా రైతులకు నారుమడి కి అయ్యే ఖర్చు తగ్గుతుంది.నీటి వినియోగాన్ని 30-35% శాతాన్ని తగ్గించవచ్చునని, 10 నుంచి 15 రోజుల ముందుగా కోతకు వస్తుందని, సుమారు ఎకరానికి 6000 నుండి 8000 వరుకు ఖర్చు ఆదా అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.