ఉపాధ్యాయుడు మృతికి పూర్వ విద్యార్థుల సంతాపం
Published: Friday May 20, 2022
బోనకల్, మే19 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని జానకీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో భౌతికశాస్త్రం ఉపాద్యాయుడిగా పని చేసిన ఆవుల రవికుమార్(50) ఖమ్మం పట్టణంలోని 4వ డివిజన్ పాండురంగపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.గత కొన్ని రోజుల క్రితం ఎప్పటి మాదిరిగానే సర్దార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో హై బీపీతో క్రింద పడిపోయిన రవికుమార్ రాత్రి 10గంటల సమయంలో కుటుంబ సభ్యులు గుర్తించి హైదరాబాద్లో హాస్పిటల్ కి తరలించారు.చికిత్స తీసుకుంటూ రవికుమార్ మంగళవారము తుది శ్వాస విడిచారు. రవికుమార్ మరణ వార్త విన్న సహచర ఉపాద్యాయులు సంతాపం తెలియజేశారు.తమకు విద్య నేర్పిన గురువు అకాల మరణం చెందడం బాధాకర విషయమని జానకీపురం పాఠశాలలో చదువుకున్నా పూర్వ విద్యార్థులు గురువారం రవికుమార్ మృతికి సంతాపం తెలియజేశారు.
Share this on your social network: