కుట్టుమిషన్లు పంపిణీచేసిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి

Published: Friday December 02, 2022
ఖమ్మం, డిసెంబర్ 1 (ప్రజాపాలన న్యూస్): జన శిక్షణ సంస్థాన్ ఖమ్మం అధ్వర్యంలో మంగాపురం తండా, నేలకొండపల్లి మండలం ఖమ్మంజిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రామ సర్పంచ్ భూక్యా సుధాకర్ సహకారంతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి  నిధులతో గ్రామంలోని మహిళలకు ఉచితంగా 30 షీలా టైలరింగ్ మిషన్స్ అందించారని జన శిక్షణ సంస్థాన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎంతో పురోగతిని సాధించాలన్నారు. అభివృద్ధి పధంలో ముందుకు సాగాలని, కుటుంబం ఆర్థికంగా బలపడాలని కోరారు. అదేవిధంగా డైరెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం మానవవనరుల నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా 2022-23 గాను 9 రకాల వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో  సెక్రటరీ, వార్డ్ మెంబెర్స్, మండల మార్కెట్ కమిటీ మెంబెర్స్, రిసోర్స్ పర్సన్స్ రజియా, జాస్మిన్, అనిత, కవిత, మహిళా మండలి లీడర్స్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.