జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పలుకార్యక్రమాలకు హాజరు మధిర నవంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి

Published: Tuesday November 08, 2022
మధిర మండలంలో సోమవారం నాడు పలు గ్రామాల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తొండలగోపవరం, తొర్లపాడు గ్రామాల్లో పలువురికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రజలతో  ఆత్మీయ పలకరించి  తొండలగోపవరం, తొర్లపాడు గ్రామాల్లో పర్యటించి పలు కుటుంబాల ని పరామర్శించడం తో పాటుగా పలువురిని ఆత్మీయంగా పలకరించారు. ముందుగా తొండలగోపవరం గ్రామంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్  ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న పెద్దలను , పార్టీ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం తొర్లపాడు గ్రామానికి చేరుకొని గ్రామ సర్పంచ్ సింగం శిరీష  ఇంటికి వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న వారి మామయ్య ని పలకరించి పరామర్శించి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అండదండలు ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చిత్తారు నాగేశ్వరరావు  రంగిశెట్టి కోటేశ్వరరావు , మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి , నాయకులు ఉమామహేశ్వర రెడ్డి , సింగం రామిరెడ్డి  పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు