డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

Published: Saturday March 20, 2021
బాలాపూర్ :(ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; స్వేరోస్ సంస్థ కు వ్యతిరేక విధానాలను చేస్తున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మార్చుకోవాలని, వారిని వెంటనే డిస్మిస్ చేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో దళిత మోర్చా అధ్యక్షులు గుండె నాగార్జున బాబు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బీజేపీ నేతలు మాట్లాడుతూ.. హిందూ సమాజం పట్ల స్వేరోస్ సంస్థ  వ్యతిరేక విధానాలను చేస్తున్న ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పదా లు మార్చుకోవాలని వారిని వెంటనే డిస్మిస్ చేయాలని బిజెపి నేతలు నినాదాలు చేశారు. ఈ.హిందు సమాజం పట్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో నడుస్తున్న స్వేరోస్ సంస్థ వ్యతిరేక విధానాలను ఎండ గట్టారు... హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, సామ సంజీవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మల్లారెడ్డి, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, జిల్లా నాయకులు టేకుల భాస్కర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ కంటి భాస్కర్,  జిల్లా ఎస్సీ ట్రెసరర్ చిత్రం నరేష్, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు నగేష్ , బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరకుపల్లి వెంకట్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, జెనిగే పద్మ ఐలయ్య యాదవ్, కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు చిత్రం శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి దొడ్డి మల్లికార్జున్, కార్యదర్శి జగదీశ్వర్ రాజు, మహిళ మోర్చ అధ్యక్షురాలు మమత ఆనంద్, యువమోర్చా అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, ఓబీసీ మోర్చా పెరమోని నరేష్ యాదవ్, ఎస్సీ  మోర్చ ఉపాధ్యక్షుడు దేశాపక జగన్, బ్యాంక్ డైరెక్టర్లు సంపత్ రెడ్డి గిరిరాజు సీనియర్ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సురేందర్ రెడ్డి, మహేందర్, మంగపతి, అరవింద్, రవితేజ, భరత్, భూషణ్ నాగనందీశ్వర్ రెడ్డి విజయ్ కాంత్ లక్ష్మణ్ రాహుల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.