అక్టోబర్ రెండవ తేదీన టిడిపి విస్తృతస్థాయి సమావేశం

Published: Friday October 01, 2021

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, జాతీయ అధికార ప్రతినిధి, నన్నూరి నర్సిరెడ్డి, భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణమాచారి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వైష్ణవి గార్డెన్ లో జరిగే క్రమానికి మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు గ్రామ కమిటీలు, నాలుగు మున్సిపాలిటీల అధ్యక్షులు, కమిటీ సభ్యులు పెద్దఎత్తున పాల్గొనాలని  విజయవంతం చేయాలని ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు జక్కా రామ్ రెడ్డి కోరారు