మసీదు ఉర్సు ఉత్సవాలకు రూ 10 వేలు ఆర్థిక సహాయం అందజేసిన

Published: Saturday December 17, 2022
బీఆర్ఎస్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి  
మేడిపల్లి, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి)

 చిలుకానగర్ డివిజన్ బొడ్రాయి సమీపంలో గల దర్గా అర్జత్ జిందా షా మదర్, హజ్రత్ సయ్యద్ బదువుద్దీన్ కుత్బుల్ మదర్ మసీదులో జరగనున్న 43వ ఉర్సు ఉత్సవాలకు హాజరుకావాలని మసీదు ప్రతినిధులు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి  ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చిలుకానగర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి చేతుల మీదుగా మసీదు ప్రతినిధులకు రూ10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ  కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్, వేముల సంతోష్ రెడ్డి, స్వీట్ హౌస్ రాజు, మాస శేఖర్, రత్నాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.