టీకా వేయించుకో.. కుటుంబ సభ్యులకు రక్షణ

Published: Wednesday September 15, 2021
బాలాపూర్: సెప్టెంబర్14, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా టీకాలు వేసుకోవడం వల్ల మీ కుటుంబ సభ్యులకు రక్షణ ఇచ్చినవారు అవుతారని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ గుడేపు ఇంద్రసేన సమక్షంలో మారి స్వచ్ఛంద సంస్థ, వైద్య అధికారుల ఆధ్వర్యంలో జరిగిన నగర్ లో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో కరోనా టీకా సెంటర్ ను కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... టీకా అందరూ తప్పక వేసుకొవాలని అన్నారు. కరోనా టీకాలు వేసుకోవడం వల్ల మీ తోపాటు మీ కుటుంబ సభ్యులకు కూడా రక్షణ ఇచ్చినవారు అవుతామని  అన్నారు. కరోనా టీకాలు ప్రజలవద్దకే తీసుకువచ్చి ఇస్తున్న వైద్యాధికారులు, వారికి సహకరిస్తున్న మారి సంస్థ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇంద్రసేనా, తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీతా శ్రీకాంత్, కో ఆప్షన్ సభ్యులు మర్రి జగన్ మోహన్ రెడ్డి, బాలాపూర్ ప్రాధమిక వైద్య కేంద్ర అధికారులు శ్రీనివాస్, నర్సింగ రావు, నాయకులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్, పన్నాల కృష్ణ రెడ్డి, మారి సంస్థ కో ఆర్డినేటర్ సాంబశివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.