తక్షణమే రైతు బంధు డబ్బులు జమ చేయాలి
మంచిర్యాల టౌన్, జూన్ 22, ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని రైతులు, కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దండెపల్లి నాయకుడు రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి,లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు పింగిలి రమేష్,రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. నగదు వేయకుండా రైతులను మోసం చెందుతోందని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో కేసిఆర్ విఫలం అయ్యారని వారు మండిపడ్డారు . పొరుగు రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రికి స్వరాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు మాత్రం కనిపించడం లేదని వారు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: