కష్ట కాలంలోనూ సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట

Published: Wednesday July 14, 2021
కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కుల పంపిణీ
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి / షాదిముబారక్ పథకం ద్వారా 28 మంది లబ్దిదారులకు చెక్కుల రూపేణా రూ.28,31,248/- మంజూరైన ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్లు హఫీజ్ పెట్ పూజిత, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి గారు,ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ శ్రీ.సాయి బాబాలతో కలిసి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే. ఆరెకపూడి గాంధీ లబ్దిదారులకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందనగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, లింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు విరేశం గౌడ్, పురుషోత్తం యాదవ్, సురేందర్, గణేష్ ముదిరాజ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.