ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన కార్పొరేటర్ చేతన హరీష్

Published: Friday April 14, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 13 (ప్రజాపాలన ప్రతినిధి)
 పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని హబ్సిగూడ డివిజన్లోని క్యాంప్ నెంబర్ 3,5 మరియు ఏక్ మినర్ మసీదులలో స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చేతన హరీష్ ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు.  
ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు కాజా భాయ్, సయ్యద్ ఖలీద్ ,మహమ్మద్ యూసఫ్ ,బిజెపి హబ్సిగూడ ఓబిసి అధ్యక్షుడు అల్కాపురి సురేష్, దళిత మోర్చా ఉపాధ్యక్షులు కట్ట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.