మత్స్యగిరి ఆలయంలో హుండీల లెక్కింపు

Published: Tuesday October 12, 2021
యాదాద్రి అక్టోబర్ 11 ప్రజా ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు సోమవారం గుట్ట పైన 3 నెలల 20 రోజులకుగాను 8,94,362/- రూపాయలు ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి ఎలిమినేడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ మేనేజర్ అంబటి నాగిరెడ్డి, ఆలయ ధర్మకర్తల చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ఆలయ ధర్మ కర్తలు, గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.