ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్ప
Published: Wednesday June 09, 2021
మేడిపల్లి, జూన్ 8, (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని శ్రీలక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తమన్ కుర్మా పేర్కొన్నారు. కరోనా విపత్తులో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తమన్ కుర్మా తెలిపారు. ఈ మేరకు బోడుప్పల్ ఇందిరా నగర్లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ కు దాత భవానీ 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారని ట్రస్ట్ చైర్మన్ తమన్ కుర్మా తెలిపారు. దాతలు ముందుకు వచ్చి డబ్బు రూపంలో కాకుండ వస్తువు రూపంలో కానీ నిత్యవసర వస్తువుల రూపంలో గాని ట్రస్టుకు సహాయం చేసి వికలాంగులను ఆదుకోవాలని ట్రస్ట్ చైర్మన్ తమన్ కుర్మా విజ్ఞప్తి చేశారు. సహాయం చేయదలుచుకున్న దాతలు ఫోన్ నెంబర్ ను 9177745159 సంప్రదించాలని ఆయన కోరారు.
Share this on your social network: