విలేకరుల సంక్షేమానికి కృషి. ...ప్రజాపాలన 2023 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే.

Published: Wednesday December 28, 2022
జన్నారం, డిసెంబర్ 27, ప్రజాపాలన: 
 
రాష్ట్ర ప్రభుత్వం విలేకరుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో  ప్రజాపాలన 2023 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేఖరుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వందకోట్ల తో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 
పత్రిక లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని పోవాలని కోరారు. వాస్తవాలు ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వానికి సహాకరించాలని కోరారు. ప్రజాసామ్యాంలో పత్రికల పాత్ర కీలకమైదని వాస్తవ  కథనాలను ఆవిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి పద్మ, వైస్ చైర్మన్ గొట్ల రాజేష్, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీ ఖాన్, జన్నారం ప్రెస్ క్లబ్  అధ్యక్షుడు సిరివేని నరసయ్య, నాయకులు భరత్ కుమార్, ముత్యం సతీష్, లెక్కల మల్లయ్య, తోకల సురేష్, తదితరులు పాల్గొన్నారు.