సాయి బాలాజీ ధియేటర్ లో టిక్కెట్ రేటు కంటే అదనపు వసూలు

Published: Tuesday March 29, 2022
ధియేటర్ యాజమాన్యం పైఅధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న అభిమానులు..
పాలేరు మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి సాయి బాలాజీ ధియేటర్ లో RRR సినిమా టిక్కెట్ల కు అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ధియేటర్ యాజమాన్యం. టిక్కెట్ ధర 200 కాగా అదనంగా యాబై రూపాయలను కూల్ డ్రింక్ పేరుతో వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన ధియేటర్ మేనేజర్ ను సైతం యాజమాన్యం తొలగించింది. మూడవ రోజు టిక్కెట్ ధర 100 రూపాయలు అమ్మాల్సి ఉండగా 200 రూపాయలు ఎలా వసూలు చేస్తున్నారని సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు ధియేటర్ యజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పడం లేదని వారు చెపుతున్నారు. కనీసం ఏసీ కూడా వేయడం లేదని ఉన్న ఫ్యాన్ లు కూడా పనిచేయడం లేదని సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోయినా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సాయి బాలాజీ ధియేటర్ యాజమాన్యం పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.