ఎమ్మార్పీఎస్ పార్టీ 27 వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday July 08, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన న్యూస్ : ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బుధవారం నాడు పలువురు నాయకులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారంగా కలిసి బాలాపూర్ చౌరస్తా యందు ఎం.ఆర్పి.ఎస్ జెండాను  ఆవిష్కరించారు. అదేవిధంగా అభినవ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ..... ఎమ్. ఆర్ పి ఎస్ ఏర్పడి 27 సంవత్సరాలైనందినీ, మందకృష్ణ మాదిగ... మాదిగల గురించి ఎల్లవేళల తపన పడుతూ అందరిని ఒకతాటిపై నిలబెట్టడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని, మన అధినేత  మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సుమారు 80 శాతం ఉన్న మాదిగలు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నారని ఆయన ఆవేదనతో పలువురు నేతలు వ్యక్తపరిచారు. ఇప్పుడైనా అందరూ ఏకమై ముందుకు సాగాలని పలువురు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బోర్ర రవి మాదిగ, ఎమ్మార్పీఎస్  సీనియర్ నాయకులు ఆది లా అమ్రిష్ చాగంటి పుల్లయ్య, బాలాపూర్ మండల అధ్యక్షులు పుట్ట రాము, ఉపాధ్యక్షుడు ముచ్చర్ల ఆనంద్, సిహెచ్ చిన్న, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి పగడాల వెంకటేష్, దాసరి మహేందర్, మస్కురి సుధాకర్, కొమ్మ మహేష్, జై సంజీవ, వంక ఉపేందర్, జిల్లా సీనియర్ నాయకురాలు జె. ఇంద్ర, మహేశ్వర్ నియోజకవర్గ అధ్యక్షురాలు శోభారాణి, హోలీయ దాసరి సంఘం  రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొల్లు రఘు, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు  పాల్గొన్నారు.