వినాయకుని నిమజ్జనం

Published: Monday September 27, 2021

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల్ రోడ్డు పక్కనే ఉన్న వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం శనివారం రోజు స్కై బ్లూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ విఘ్నేశ్వరుని శోభయాత్రలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా ఏసీపీ బాలకృష్ణారెడ్డి వారికి స్కై బ్లూ యూత్ అసోసియేషన్ వారు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి మరియు ఇబ్రహీంపట్నం ఏసీబీ బాలకృష్ణ రెడ్డి, సీఐ సైదులు పాల్గొనారు. విగ్నేశ్వరుని మహా ప్రసాద లడ్డువేలంలో పాల్గొన్న ప్రముఖులలో శేరిగూడ వాస్తవ్యులు క్యామ శ్రీకాంత్ (బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్) 95000 కు మహా ప్రసాదన్ని లడ్డునీ కైవసం చేసుకున్నారు .శోభ యాత్ర లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.