గోదావరి నది పరిశీలించిన కలెక్టర్

Published: Wednesday July 13, 2022
ఇబ్రహీంపట్నం, జూలై 12 ( ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని గత ఐదు రోజులు నుండి 
 కురుస్తున్న వర్షాల నేపత్యంలో  ఎర్దండి గ్రామంలో  గోదావరి నదిని  జిల్లా కలెక్టర్ రవి, ఎస్పి సింధూ శర్మ  పరిశీలించారు. ఎస్సారెస్పీ  గేట్లు వదలడంవలన గోదావరి నదిలో నీటిమట్టం ఎక్కడివరకు వస్తుంది గోదావరి నదిలోకి నీరు ఎక్కువ రావడం వలన అక్కడ ఎదురయ్యే పరిస్థితులు గురించి తహశీల్దార్ మాహేశ్వర్  వివరంగా వారికి వివరించారు జాలర్లు గాని ప్రజలు గాని ఎవరూ కూడా గోదావరి నది వైపు వెళ్లకూడదని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.కార్యక్రమంలో ఆర్డిఓ వినోద్ కుమార్, డీఎస్పీ మరియు సీఐ  రాజేశేఖర్ రాజు  తహశీల్దార్ మాహేశ్వర్, ఎస్సై  ఉమాసాగర్, ఆర్ఐ  భూమేశ్  విఆర్వో  లు రవి , సంజీవ్ , రాజయ్య ,కల్లెడ గంగాధర్,ఉప సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.