పీర్జాదిగూడలో భారీ వర్షానికిి లోతట్టు ప్రాంతాలు జలమయం
Published: Wednesday July 27, 2022
మేడిపల్లి, జూలై26 (ప్రజాపాలన ప్రతినిధి)
సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 25వ డివిజన్లోని క్రాంతి కాలనీ,శ్రీ సాయి నగర్ కాలనీలలోకి పైనుండి వచ్చిన భారీ వరద నీరు ఇళ్లలోకి,అపార్ట్మెంట్ సెల్లర్ లోకి చేరుకోవడంతో వెంటనే హుటాహుటిన రాత్రి 2 గంటల సమయాన స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి విద్యుత్ అధికారులతో మాట్లాడి సరఫరా నిలిపివేసి,మున్సిపల్ మన్సూన్ టీం సహాయంతో డీజిల్ మోటార్ పెట్టి వరద నీరును తీసివేయించడం జరిగింది. మున్ముందు ఇలాంటి పరిస్థితుల్లో రానివ్వకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి కాలనీ,అపార్ట్మెంట్ వాసులకు హామీ ఇచ్చారు.
Share this on your social network: