ప్రయాణీకుల దప్పిక తీర్చేందుకే చలివేంద్రం

Published: Tuesday February 21, 2023
* మున్సిపల్ చైర్ పరు.న్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ 
వికారాబాద్ బ్యూరో 20 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రయాణికుల దప్పికను తీర్చేందుకే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ ఐక్యత సేవా సమితి ఆధ్వర్యంలో రైతుబజార్ దగ్గర చలివేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ వైస్ చైర్ పర్సన్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోహెద వెంకటాచారి, కౌన్సిలర్ శ్రీదేవి సదానంద్ రెడ్డి, విశ్వకర్మ ఐక్యత సేవ సమితి సభ్యులు, స్థానిక మహిళలు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.