అర్ వి సిండికేట్ గురుస్వాములని సత్కరించిన మధిర నియోజకవర్గ అయ్యప్పలు

Published: Wednesday December 15, 2021
మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : ఆర్ వి సిండికేట్ వారు అయ్యప్ప స్వాములకు కొన్ని సంవత్సరాల నుంచి అన్నదానము నిర్వహిస్తున్నారు. అలాగే ఎంతో మంది మధిర నియోజకవర్గం భక్తులకు ఈ దీక్షా విలువలు తెలిపి నలభై ఒక్క రోజుల దీక్షలు చేపించి అయ్యప్ప దర్శనం చేసుకోటానికి కారణం అయ్యారు. అన్నదనంతో పాటు ఈ మధిర నియోజకవర్గంలో ఉన్న ఎంతో మంది స్వాములకు ఉచ్చితంగా స్వామివారి దర్శనం టిక్కెట్లు మరియు నెయ్యి అభిషేకం టికెట్స్ చేసి ఇస్తున్నారు. అన్నదాన కార్యక్రమం చివరికి చేరుకున్న సందర్భంగా మధిర నియోజకవర్గంలో ఉన్న గురుస్వాములు అర్.వి సిండికేట్ గురుస్వాములు అయిన అర్ వి స్వామి, వెంకటరెడ్డి స్వామి కి శాలువ కప్పి సన్మానం చేశారు. తదనంతరం ఆర్.వి గురుస్వామి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమము దాతల సహకారంతో చేయడంవల్ల ఎంతో సంతోషం ఉందని అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, మాలాధరులు, సిండికేట్ సభ్యులకు అయ్యప్ప దేవుని ఆశీసులు ఉండాలని కోరారు. అనంతరం సభ్యులందరూ మాట్లాడుతూ అర్ వి గురుస్వామి చేపట్టిన మాలధారణ కార్యక్రమం వల్ల అయ్యప్పలకు ఎంతో మేలు జరిగిందని, ఈయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కలగజేయాలని కోరుకున్నారు. తదనంతరం ఈ రోజు దాత శ్రీ ఇరుకుళ్ళ బాలకోటి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఇలాంటి కార్యక్రమంలో భాగం కావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి స్వామి, నల్లమల గోపీస్వామి, కాస్తాల సతీష్ స్వామి, పబ్బతి జగదీష్ స్వామి, సామినేని సాంబైయ్యా స్వామి, విలేకరు శ్రీనివాసరావు స్వామికొనంగి సాయిబాబు స్వామి మరియు పలు ఉరుల గురుస్వాములు పాల్గొన్నారు.