మయూరధ్వజుని దానశీలతకు ప్రతీక ధ్వజస్థంభం

Published: Monday April 18, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 17 ఏప్రిల్ ప్రజాపాలన : మయూరధ్వజుని దానశీలతకు ప్రతీక ధ్వజస్థంభం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ గ్రామంలో పునఃనిర్మాణం చేసిన హనుమాన్ మందిరం ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాభారతంలో మయూరధ్వజుని దానశీలతకు మెచ్చి, శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో నేడు దేవాలయాల ముందు ధ్వజ స్తంభంగా కొలువై, పూజలు అందుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్, వేణుగోపాల్ రెడ్డి ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా నరోత్తం రెడ్డి  ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.