పిడుగుపాటు కు గు గురైన కుటుంబానికి ప్రభుత్వ ప్రమాద చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

Published: Thursday October 28, 2021

జగిత్యాల, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల మండల లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు నక్క హరీష్ గత వర్షాకాలం పిడుగుపాటుకు గురై మరణించగా ప్రభుత్వం ద్వారా మంజూరైన 6 లక్షల విలువగల ప్రొసీడింగ్ కాపీని హరీష్ తండ్రి లింగన్న ను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేసినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో ముఖ్యమంత్రి అందరికి సంక్షేమ పథకాలు అందించాలనే దిశగానే కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, రైతు బంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నగేష్ గౌడ్, విడిసి చైర్మన్ స్వామిరెడ్డి, గ్రామస్తులు సత్తి రెడ్డి, రవి, రాజీ రెడ్డి, రాజేష్, విజయ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్యాక్స్, ఎఎంసి డైరెక్టర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.