బిపిన్ రావత్ మరణం రక్షణ రంగానికి తీరని లోటు

Published: Saturday December 11, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 10 డిసెంబర్ ప్రజాపాలన : మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణం రక్షణ రంగానికి తీరనిలోటని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వగృహంలోని ఆవరణలో భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, మధులిక రావత్, వారితోపాటు మరో 11 మంది సైనికుల అకాల మరణం దేశానికి తీరని లోటుగా మిగిలిందన్నారు.
నేటి బాలలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి :
శుక్రవారం వికారాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ కు స్మార్ట్ ఫోన్స్ మరియు దుస్తులు పంపిణి కార్యక్రమాన్ని సిడిపిఓ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం పిల్లలకు సరైన సమయంలో అందిచాలన్నారు. పిల్లల భవిష్యత్తు పునాది మీ చేతుల్లోనే ఉందని వారికీ మంచి విలువలతో కూడిన విద్యను అందించి బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.