సత్తెనపల్లి రామకృష్ణకు బోనకల్ మండల సిపిఎం పార్టీ ఘన నివాళి

Published: Friday September 09, 2022
బోనకల్ ,సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయం నందు విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన ఖమ్మం పట్టణ వాసి సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతలచెర్వు కోటేశ్వరరావు రామకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం జరిగిన సంతాప సభలో కోటేశ్వరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు భారంగా మోపిన విద్యుత్తు చార్జీలకి వ్యతిరేకంగా హైదరాబాదులో నిర్వహించిన సిపిఎం పార్టీ ఉద్యమంలో ఖమ్మం జిల్లా వాసి సిపిఎం పార్టీ నాయకుడు సత్తెనపల్లి రామకృష్ణ మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు విద్యుత్ చార్జీలు పెంచాలంటే ప్రభుత్వాలు భయపడ్డాయనీ అన్నారు.సిపిఎం పార్టీ బోనకల్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ సత్తెనపల్లి రామకృష్ణ మరణించి నేటికీ 22 సంవత్సరాలు అవుతున్న ఆయన ఉద్యమం మనందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతులు,గుగులోతు నరేష్, సిపిఎం పార్టీ బోనకల్ గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస్, పార్టీ నాయకులు, బోనకల్ గ్రామ వార్డు మెంబర్ ఉప్పర శ్రీనివాస్, మచ్చ గురవయ్య ,ముళ్లపాటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.